29-09-2009
రెలిగేర్‌ పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్‌రకం :
ఓపెన్‌ ఇండెడ్‌ ప్రారంభ తేదీ : సెప్టెంబరు 29
ముగింపు తేదీ : అక్టోబరు 28
పెట్టుబడి విధానం : గ్రోత్‌
ఫండ్‌ మేనేజరు : ప్రదీప్‌ కుమార్‌
ప్రారంభ రుసుము : లేదు
నిష్కమణ రుసుము : 1 శాతం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలకు మెజారిటీ వాటా లేదా నిర్వహణ నియంత్రణ ఉండే ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూలధనాన్ని పెంచుకోవాలన్నది ఫండ్‌ లక్ష్యం.పీఎస్‌యూ ఆధారిత ఫండ్‌ కాబట్టి రిస్క్‌, ప్రతిఫలం రెండూ మోస్తరుగానే ఉండొచ్చు.ఈ తరహా ప్రొఫైల్‌ నచ్చినవారు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చన్నది విశ్లేషకుల సలహా.
22-09-2009
  • వేల్యూ రీసెర్చ్‌ రేటింగ్స్‌లో బిర్లా సన్‌లైఫ్‌కు అగ్రస్థానం
మ్యూచువల్‌ ఫండ్‌ రీసెర్చ్‌ సంస్థ బిర్లా సన్‌లైఫ్‌ ఉత్పత్తులకు స్వతంత్ర రేటింగ్‌ ఏజన్సీ వేల్యూ రీసెర్చ్‌ టాప్‌ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. వాల్యూ రీసెర్చ్‌ ఆగస్టు 31 నాటికి 31 పథకాలకు రేటింగ్‌ ఇవ్వగా అందులో బిర్లా సన్‌లైఫ్‌కు చెందిన 14 పథకాలకు ఫోర్‌, ఫైవ్‌ స్టార్‌ రేటింగ్స్‌ దక్కాయని సంస్థ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు హాంకాంగ్‌కు చెందిన అసెట్‌ మేగజైన్‌ 2009 సంవత్సరానికిగాను 'బెస్ట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ - ఇండియా' అవార్డును బిర్లా సన్‌ళైఫ్‌కు ప్రకటించిందని, ఏషియన్‌ ఇన్వెస్టర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు-2009, బెస్ట్‌ ఆన్‌షోర్‌ ఫండ్‌ హోస్‌ ఇండియా అవార్డులు దక్కాయని వరుసగా రెండవసారి సిఎన్‌బిసి టివి 18, క్రిసిల్‌ సంయుక్తంగా మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును బిర్లా సన్‌లైఫ్‌కు అందించాయని తెలిపింది. తమ పథకాల్లో డైనమిక్‌ బాండ్‌, ఫ్లోటింగ్‌ రేట్‌ ఎల్‌టి, ఎంఐపి 2 సేవింగ్స్‌లకు వాల్యూ రీసెర్చ్‌ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ను మిగిలిన పథకాలకు ఫోర్‌స్టార్‌ రేటింగ్‌ను ప్రకటించిందని తెలిపింది.
15-09-2009

  • డివిడెండ్లు ప్రకటించిన రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌

అనిల్‌ దీరూభాయ్‌ అంబానీ గ్రూపు రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రెండు రకాల ఫండ్‌ స్కీముల్లో డివిడెండ్‌ను ప్రకటించింది. రిలయన్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ఫండ్‌లో రికార్డు తేదీ సెప్టెంబర్‌ 18 నాటికి 15 శాతం డివిడెండ్‌ను, రిలయన్స్‌ ఎన్‌ఆర్‌ఐ ఈక్విటీ ఫండ్‌లో 40 శాతం డివిడెండ్‌ను ఇవ్వనున్నామని సంస్థ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మీడియా ఫండ్‌లో యూనిట్‌ ఒక్కింటికి 1.50 రూపాయలు, ఎన్‌ఆర్‌ఐ ఫండ్‌లో యూనిట్‌ ఒక్కింటికి 4 రూపాయలు అందుతాయని ఆర్‌ఎంఎఫ్‌ సిఇఓ సుందీప్‌ శిఖా వివరించారు.

  • ఫండ్‌ వ్యాపారంలోకి శ్రేర :
మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) వ్యాపారాన్ని ప్రారంభించేందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థ శ్రేర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు షరతులతో కూడిన అనుమతులను సెబీ మంజూరు చేసింది. అసెట్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, ట్రస్టీషిప్‌ సేవల కోసం శ్రేర ఇన్‌ఫ్రా రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయనుంది.
-09-2009
ఫండ్‌ వ్యాపారం చేసేందుకు యాక్సిస్‌ ఎఎంసికి గ్రీన్‌ సిగ్నల్‌
యాక్సిస్‌ బ్యాంకు లిమిటెడ్‌ సబ్‌సైడరీ యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ దేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని నిర్వహించేందుకు కావలసిన అన్ని అనుమతులనూ పొందింది. యాక్సిస్‌ ఎఎంసికి అందవలసిన చివరి నియంత్రణా అనుమతి కూడా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నుంచి అందిందని సంస్థ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌ 2009 నాటికి తమ తొలి ప్రోడక్టులు మార్కెట్‌ను తాకుతాయని సంస్థ ప్రకటించింది. ఈక్విటీ, డెబిట్‌ ప్రోడక్టులను తాము అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని సంస్థ మేనేజి,గ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ ఆనంద్‌ వివరించారు. భారత్‌లో ప్రస్తుతం అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోందని, గడచిన ఆరు సంవత్సరాల్లో సిఎజిఆర్‌ 30 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సైతం ఆకర్షణీయమైన అవకాశాలను ముందుకు తీసుకువస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ప్రోడక్టులను విడుదల చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు కావలసిన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని, ఈ వ్యాపారంలో సాధ్యమైనంత ఎక్కువ వాటాను స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
24-08-2009
  • మూడు స్కీముల్లో డివిడెండ్‌ ప్రకటించిన రిలయన్స్‌ మ్యూచువల్స్‌

అనిల్‌ దీరూభాయ్‌ అంబానీ ఆధ్వర్యంలోని అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మూడు ఈక్విటీ స్కీముల్లో డివిడెండ్‌ను ప్రకటించింది. రిలయన్స్‌ బ్యాంకింగ్‌ ఫండ్‌, రిలయన్స్‌ ఫార్మా ఫండ్‌, రిలయన్స్‌ టాక్స్‌ సేవర్‌ ఫండ్స్‌లో డివిడెండ్లను అందిస్తున్నట్టు సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 28 నాటికి బ్యాంకింగ్‌ ఫండ్‌లో ముఖవిలువపై 20 శాతం, ఫార్మా ఫండ్‌లో 15 శాతం, టాక్స్‌ సేవర్‌ ఫండ్‌లో 15 శాతం డివిడెండ్‌ను అందించనున్నామని, దీంతో మొత్తం బ్యాంకింగ్‌ ఫండ్‌ ఖాతాదారులకు 160 శాతం, ఫార్మా ఫండ్‌ ఖాతాదారులకు 40 శాతం, టాక్స్‌ సేవర్‌ ఫండ్‌ ఖాతాదారులకు 40 శాతం డివిడెండ్‌ అందినట్టువుతుందని తెలిపింది. గడచిన ఆరు నెలల కాలంలో ఈ మూడు ఫండ్‌లు వరుసగా 66.85 శాతం, 60.40 శాతం, 60.52 శాతం వృద్ధిని నమోదు చేశాయని తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 56 స్కీములను నడుపుతుండగా, అందులో మొత్తం 71 లక్షల మంది పెట్టుబడులు పెట్ట ఉన్నారని, ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది.

  • సహారా మ్యూచువల్స్‌ నుంచి మరిన్ని ఫండ్స్‌

ఈ ఆర్థిక సంవత్సరంలోగా మరో మూడు డెబిట్‌, రెండు ఈక్విటీ ఫండ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని సహారా మ్యూచువల్‌ ఫండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నరేష్‌ కుమార్‌ గార్గ్‌ వివరించారు. వీటితో పాటు రోజువారీ వేతనాలు పొందుతున్న వారికోసం డైలీ సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఐపి)ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సంస్థ మేనేజ్‌మెంట్‌ కింద 237 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ఫండ్స్‌ను విడుదల చేసేందుకు కావలసిన అనుమతుల కోసం సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకు ఇప్పటికే డ్రాఫ్ట్‌ ఆఫర్‌ డాక్యుమెంట్లను అందించామని, త్వరలో అనుమతులు లభించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తొలి ఫండ్‌ మరో నెల రోజుల్లోగా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రావచ్చని అంచనా వేశారు. వీటిల్లో ముఖ్యమైంది సహారా డైలీ ఫండ్‌ అని, ఓపెన్‌ ఎండెడ్‌ విధానంలో 100 శాతం డెబిట్‌ స్కీమ్‌ ఫండ్‌లో ఎవరైనా 10 రూపాయల ప్రారంభమొత్తం నుంచి భాగస్వామ్యులు కావచ్చని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఇటువంటి ఫండ్స్‌ భవిష్యత్‌లో మంచి రాబడులను అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 కోట్ల మందికిపైగా రోజువారీ వేతనాలను అందుకుంటున్నారని ప్రభుత్వ గణాంకాలు చూపుతున్నాయని, ఈ తరహా మైక్రో సేవింగ్‌ పథకాల ద్వారా వారికి లబ్ది కలుగుతుందని వ్యాఖ్యానించారు.